APలో ఎమ్మెల్యేల ప్రమాణం : రేపు స్పీకర్ ఎన్నిక

APలో ఎమ్మెల్యేల ప్రమాణం : రేపు స్పీకర్ ఎన్నిక

ఏపీలో 15వ అసెంబ్లీ కొలువు దీరింది. ప్రొటెం స్పీకర్ శంబంగి చిన వెంకట అప్పల నాయుడు కొత్త సభ్యులతో ప్రమాణం చేయించారు. మొదట సభానాయకుడు, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. తర్వాత ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తర్వాత మంత్రులు, సభ్యులతో అక్షర క్రమంలో ప్రమాణం చేస్తున్నారు.

రేపు అసెంబ్లీ స్పీకర్ గా తమ్మినేని సీతారాంను అధికారికంగా ఎన్నుకోనుంది అసెంబ్లీ.  ఈ నెల 14 న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించనున్నారు. 15,16తేదీల్లో సభకు సెలవు ఇచ్చారు. 17, 18 న తిరిగి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.