ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ‌కరోనా 

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ‌కరోనా 

హైదరాబాద్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గత రెండు, ‌మూడు రోజులుగా కోవిడ్ 19 స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఎమ్మెల్సీ కవిత.. పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. దీంతో గత వారం రోజులుగా తనను‌ కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. కొన్ని రోజుల పాటు తాను హోం ‌ఐసోలేషన్ లో ఉండనున్నట్లు తెలిపారు.