కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్హౌస్కి కవిత.. లేఖ వివాదం తర్వాత ఫస్ట్ టైం ఫామ్హౌస్కు..

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్హౌస్కి కవిత.. లేఖ వివాదం తర్వాత ఫస్ట్ టైం ఫామ్హౌస్కు..

సిద్ధిపేట జిల్లా: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవుతున్న క్రమంలో ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ వద్ద హడావిడి కనిపించింది. ఎర్రవల్లి కేసీఆర్ ఫామ్హౌస్కి ఎమ్మెల్సీ కవిత వెళ్లడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కారణమైంది. లేఖ వివాదం తర్వాత తొలిసారి ఫామ్హౌస్కి కవిత వెళ్లడం గమనార్హం. కేసీఆర్ మనవడు హిమాన్షు కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్లాడు. మంగళవారం సాయంత్రం హరీష్ రావు కూడా కేసీఆర్ తో ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం నుంచి హరీష్ రావు కేసీఆర్ ఫాం హౌస్లోనే ఉన్నారు. 

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, RS ప్రవీణ్ కుమార్ ఫామ్ హౌజ్కు చేరుకున్నారు. కేసీఆర్‌కి మద్దతుగా సమీప ప్రాంతాల బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్నారు. దీంతో ఎర్రవల్లి ఫామ్ హౌజ్ పరిసరాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. బుధవారం ఉదయం 9 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ హైదరాబాద్ బయలుదేరనున్నారు. బీఆర్కే భవన్లో కేసీఆర్ను పీసీ ఘోష్ కమిషన్  ప్రశ్నించనుంది. విచారణ కమిషన్ను ఎదుర్కోబోతున్న తొలి మాజీ సీఎం కేసీఆర్ కావడం గమనార్హం.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై నిరుడు మార్చి 13న ఏర్పాటు చేసిన పీసీ ఘోష్​ కమిషన్..​ కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధం ఉన్న 109 మంది అధికారులు, ఏజెన్సీ ప్రతినిధుల స్టేట్మెంట్లను రికార్డ్​ చేసింది. ఓపెన్​కోర్టు ద్వారా ముఖ్యమైన ఇంజినీర్లు, ఐఏఎస్లను క్రాస్​ఎగ్జామినేషన్​ చేసి, అఫిడవిట్లు తీసుకున్నది. దాదాపు అధికారులందరూ అప్పటి ప్రభుత్వం నిర్ణయాలకు అనుగుణంగానే నడుచుకున్నామని చెప్పడంతో..  విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న వారి స్టేట్​మెంట్లు కూడా రికార్డు  చేయాలనే నిర్ణయానికి కమిషన్​ వచ్చింది.

ఇందులో భాగంగానే  మాజీ సీఎం కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మాజీ​ మంత్రి హరీశ్​రావు,  ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్​కు నోటీసులు జారీ చేసింది.  ఈ మేరకు ఈ నెల 6న  ఈటలను , 9న  హరీశ్​రావును ఓపెన్​కోర్టులో విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్​సబ్​కమిటీ ఓకే చెప్పిందని, నిర్మాణానికి కేబినెట్​అప్రూవల్​కూడా ఉందని ఈటల స్టేట్​మెంట్​ఇచ్చిన సంగతి తెలిసిందే.

సీడబ్ల్యూసీ, వ్యాప్కోస్​ సిఫార్సుల మేరకే ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చామని హరీశ్​రావు చెప్పారు.  బ్యారేజీల లొకేషన్ల మార్పు, నీటి నిల్వ ఇంజినీర్ల నిర్ణయమేనని, ఇందులో తమ ప్రమేయమేమీ లేదని  కమిషన్కు వివరించారు. టెక్నికల్​ అంశాలతో తమ ప్రభుత్వానికేం సంబంధం లేదని వెల్లడించారు. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో అప్పుడు  సీఎంగా ఉన్న కేసీఆర్..  కమిషన్ ఎదుట ఎలాంటి సమాధానాలు ఇస్తారనేది ఆసక్తి రేపుతున్నది.

ముఖ్యంగా తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు రీ ఇంజినీరింగ్​చేయడానికి గల కారణాలు, బ్యారేజీల లొకేషన్ల మార్పు, డిజైన్లు, నాణ్యత, నిర్వహణ లోపాలు, కేబినెట్ ఆమోదం లేకుండా ప్రాజెక్టు నిర్మాణం, ప్రాజెక్టు పూర్తి కాకముందే బిల్లుల చెల్లింపులు, వీటితో పాటు విజిలెన్స్, ఎన్డీఎస్ఏ (నేషనల్​ డ్యామ్​ సేఫ్టీ  అథారిటీ) లేవనెత్తిన అంశాలపై కేసీఆర్ను కమిషన్​పలు ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నది.