
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ జాగృతికి విదేశీ అధ్యక్షులను జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవిత నియమించారు. ఈ మేరకు ఆదివారం ఆ జాబితాను వెల్లడించారు. న్యూజిలాండ్కు అరుణ జ్యోతి, గల్ఫ్కు చెల్లంశెట్టి హరిప్రసాద్, ఖతర్ కు మూకల ప్రవీణ లక్ష్మి, అడ్వైజర్ గా నందిని అబ్బగోని, యూఏఈ అధ్యక్షుడిగా పీచర వెంకటేశ్వర రావు, ప్రధాన కార్యదర్శిగా శేఖర్గౌడ్ ను నియమించారు.
కువైట్ కు మర్క ప్రమోద్ కుమార్, సౌదీ అరేబియాకు మహ్మద్ మొజ్జం అలీ ఇఫ్తీకర్, ఒమన్ కు గుండు రాజేందర్ నేత, బ్రిటన్కు సుమన్ రావు బల్మూరి, ఇటలీకి తానింకి కిశోర్ యాదవ్ , ఫిన్లాండ్ కు ఐరెడ్డి సందీప్ రెడ్డి, పోర్చుగల్ కు- ప్రకాశ్ పొన్నకంటి, మాల్టాకు పింటు ఘోష్ , కెన్యాకు స్వప్న రెడ్డి గంట్ల, ఇరాక్, కుర్దిస్తాన్లకు మహ్మద్ సల్మాన్ ఖాన్ లను నియమించారు. కాగా, జాగృతి మహారాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా శ్రీనివాస్సుల్గేని నియమితుయ్యారు.