తన భర్తకు కరోనా సోకడంతో తన కుటుంబం మొత్తం క్వారంటైన్లోకి వెళ్లినట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఎమ్మెల్సీ కవిత భర్త అనీల్ కరోనా బారినపడటంతో ఆయన హోంక్వారంటైన్లో ఉన్నారు.
‘నా భర్తకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన హోంక్వారంటైన్లో ఉన్నారు. నేను, నా కుటుంబం కూడా క్వారంటైన్లోకి వెళ్తున్నాం. మేం పబ్లిక్గా కానీ, పర్సనల్గా కానీ ఎవరిని కలవం. నా యొక్క కార్యక్రమాలన్నింటిని నా ఆఫీస్ త్వరలో రీషెడ్యూల్ చేస్తుంది’ అని ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.