హైదరాబాద్, వెలుగు: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ అభివృద్ధి మోడల్పై ప్రసంగించేందుకు ఎమ్మెల్సీ కవిత ఆదివారం సాయంత్రం లండన్కు బయల్దేరారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో కార్పొరేషన్ చైర్మన్లు మేడె రాజీవ్సాగర్, అనిల్ కూర్మాచలం, బీఆర్ఎస్నాయకులు ఆమెకు వీడ్కోలు పలికారు. ‘‘ఎక్స్ ప్లోరింగ్ ఇన్ క్లూసివ్ డెవలప్మెంట్ : ద తెలంగాణ మోడల్’’ అనే అంశంపై సోమవారం నిర్వహించే సదస్సులో కవిత ప్రసంగించనున్నారు.
వ్యవసాయం, కరెంట్, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, పరిశ్రమలు, ఐటీ తదితర రంగాల్లో సాధించిన ప్రగతిపై ప్రజంటేషన్ఇవ్వనున్నారు. రైతులకు పెట్టుబడిసాయం, 24 గంటల కరెంట్తో రైతులు ఆర్థికంగా బలోపేతమవడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రీచార్జ్అయ్యేలా కుల వృత్తులకు ప్రోత్సాహం.. మిగులు విద్యుత్ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించడానికి పడిన కష్టం, మిషన్కాకతీయ, మిషన్భగీరథ, హైదరాబాద్లో మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై ఆమె ప్రసంగించనున్నారు.