దళిత బంధు స్పూర్తితో గిరిజన బంధు

దళిత బంధు స్పూర్తితో గిరిజన బంధు

దళితబంధు స్పూర్తితో త్వరలో గిరిజనబంధు ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. హైదరాబాద్ నాచారంలో దళితబంధు లబ్ధిదారుని ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లాలో 563 మందికి దళిత బంధు ఇస్తున్నట్లు తెలిపారు. 

రాష్ట్రంలో అర్హులైన దళితులందరికీ దళితబంధు వచ్చేలా కృషి చేస్తామని కవిత హామీ ఇచ్చారు. ఎలాంటి నిబంధనలు పెట్టకుండా దళిత బంధు ద్వారా 10 లక్షల రూపాయలను లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిపారు. దళితులు ఆర్థికంగా ఎదగాలనేదే కేసీఆర్ లక్ష్యమన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు.