తెలంగాణ పోరాటంలో క్రిస్టియన్లది కీలక పాత్ర: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ పోరాటంలో క్రిస్టియన్లది కీలక పాత్ర: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ పోరాటంలో క్రిస్టియన్లు కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. 9 ఏళ్లలో రాష్ట్రంలో ఒక కమ్యూనల్ ఇష్యూ కూడా జరగలేదని ఆమె అన్నారు. ప్రజలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా సికింద్రాబాద్ వెస్లీ డిగ్రీ కాలేజీలో దళిత క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏ మతమైనా ప్రతి పండగను రాష్ట్ర ప్రజలు కలిసి జరుపుకుంటారని ఆమె చెప్పారు. కేసీఆర్ ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం అందరికి ఇస్తాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కవిత కేక్ కట్ చేసి కేసీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.