
హైదరాబాద్ / న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్నారు. భర్త అనిల్కుమార్, మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్కుమార్, లీగల్ టీం, ముఖ్య అనుచరులతో కలిసి కవిత బేగంపేట ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి నేరుగా తుగ్లక్రోడ్లో ఉన్న సీఎం కేసీఆర్నివాసానికి వారు వెళ్లారు. అయితే కవిత సోమవారం ఈడీ విచారణకు అటెండ్అవుతారా ? మళ్లీ స్కిప్ చేస్తారా ? అనే దానిపై డైలమా కొనసాగుతోంది
లీగల్ టీంతో భేటీ
ఈడీ విచారణపై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత లీగల్ టీంతో ఆదివారం రాత్రి కూడా సమావేశమయ్యారు. సోమవారం నాటి విచారణకు హాజరు కావాలా ? వద్దా ? అటెండ్ కాకుంటే లీగల్గా ఎలాంటి సమస్యలు వస్తాయి ? అనే దానిపై చర్చించారు. సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్తో దీనిపై ఫోన్లో సంప్రదింపులు జరిపారు. సోమవారం పరిస్థితులకు అనుగుణంగా విచారణకు వెళ్లాలా.. వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ఈనెల 16న కవిత రెండోసారి ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. ఆ రోజున ఢిల్లీలోనే ఉన్నా వెళ్లలేదు. తన ప్రతినిధిగా బీఆర్ఎస్ నేత, అడ్వకేట్ సోమ భరత్కుమార్ను ఈడీ ఆఫీస్కు ఆమె పంపారు. నిబంధనల మేరకు ఈడీ విచారణ సాగడం లేదంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే దానిపై అర్జంట్గా విచారించలేమని, ఈనెల 24న విచారణ చేపడుతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు తన పిటిషన్పై నిర్ణయం ప్రకటించే వరకు విచారణకు రాలేనని అడ్వకేట్ ద్వారా ఈడీకి కవిత చెప్పారు. కవిత విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఈడీ ఈనెల 20న (సోమవారం) విచారణకు హాజరుకావాలంటూ మళ్లీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కవిత ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కవిత పిటిషన్పై సుప్రీం కోర్టులో ఈడీ కేవియట్వేయడం, ఇప్పటికే ఒకసారి విచారణకు డుమ్మా కొట్టడంతో సోమవారం ఢిల్లీలో అందుబాటులో ఉండాలని సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ ఒకరు కవితకు సూచించారు. ఆ సూచనతోనే కవిత తన కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీకి వెళ్లారు.కాగా, మహిళ అయిన తనను ఇంటి దగ్గర విచారించేలా ఈడీ ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 14 న కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ పై స్టేకు నిరాకరించిన సీజేఐ, విచారణను ఈ నెల 24 కు వాయిదా వేశారు. కవిత పిటిషన్లో తమ వాదనలు వినకుండా ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని కోరుతూ ఈడీ సుప్రీం కోర్టులో కేవియట్దాఖలు చేసింది.
ఆ ముగ్గురి కన్ఫ్రంటేషన్ విచారణ..
ఢిల్లీ లిక్కర్స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి శనివారం విచారణకు హాజరుకాలేదు. ఈ కేసులో ఇప్పటికే ఆయన కుమారుడు మాగుంట రాఘవ అరెస్ట్ అయ్యారు. లిక్కర్స్కాంలో తాను కవిత బినామీని అని విచారణలో ఒప్పుకున్న అరుణ్ రామచంద్ర పిళ్లై ఆ స్టేట్మెంట్విత్ డ్రా చేసుకోవడానికి రౌస్ఎవెన్యూ కోర్టులో పిటిషన్వేశారు. కవిత పేరు ప్రస్తావించకుండానే ఈడీ ఆమె సెంట్రిక్గానే దానిపై కౌంటర్పిటిషన్దాఖలు చేసింది. కవితతో పాటు అరుణ్రామచంద్ర పిళ్లై, కవిత మాజీ ఆడిటర్బుచ్చిబాబును ఈడీ కన్ఫ్రంటేషన్ (ముఖాముఖి) విచారణ చేయాల్సి ఉంది. ఈనేపథ్యంలో పిళ్లై ఈడీ కస్టడీని కోర్టు పొడగిస్తూ వస్తోంది.