నేడు షోలాపూర్ లో బతుకమ్మ వేడుకలు

నేడు షోలాపూర్ లో బతుకమ్మ వేడుకలు
  • నేడు షోలాపూర్ లో బతుకమ్మ వేడుకలు
  • పాల్గొననున్న ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం మహారాష్ట్రలోని షోలాపూర్​కు వెళ్లనున్నారు. పుంజాల్​మైదాన్​లో నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకల్లో స్థానిక మహిళలతో కలిసి ఆమె పాల్గొంటారు. మహారాష్ట్ర బీఆర్ఎస్​నేతలు నాగేశ్​వల్యాల్, దశరథ్​గోప్​ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.

ఉదయం 7 గంటలకు హైదరాబాద్​ నుంచి రోడ్​మార్గంలో కవిత బయల్దేరి మధ్యాహ్నం షోలాపూర్​కు చేరుకుంటారు. నగరంలోని దత్తవాడలో బతుకమ్మ పేర్చి అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు శోభాయాత్రగా బతుకమ్మలను తీసుకొని అక్కల్​కోట్​ రోడ్డులోని పుంజాల్ ​మైదాన్​కు చేరుకుంటారు.