నవంబర్ 5 న మాదిగల యుద్ధభేరి పోస్టర్ల ఆవిష్కరణ

నవంబర్ 5 న  మాదిగల యుద్ధభేరి పోస్టర్ల ఆవిష్కరణ

కోటగిరి, వెలుగు: నవంబర్ 5 న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే మాదిగల యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. కోటగిరిలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద కార్యక్రమ పోస్టర్లను ఎమ్మార్పీఎస్ లీడర్లు ఆవిష్కరించారు.

బాన్సువాడ డివిజన్ ఇన్​చార్జి నాగేశ్​మాట్లాడుతూ..తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు 23 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని, మాదిగ డిక్లరేషన్ ప్రకటించాలని,  డప్పుచప్పుళ్ల కళాకారులకు రూ.4000 ఫించన్​ఇవ్వాలని డిమాండ్​చేశారు. ఎమ్మార్పీఎస్ కోటగిరి మండలాధ్యక్షుడు  సాయిలు, ఉపాధ్యక్షుడు శ్రీను, సభ్యులు సాయిలు, దినేశ్, శ్రీకాంత్, నవీన్, కృష్ణ పాల్గొన్నారు.