పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై క్రిమినల్స్ కాల్పులు.. అక్కడిక్కడే కానిస్టేబుల్ మృతి

పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై క్రిమినల్స్ కాల్పులు.. అక్కడిక్కడే  కానిస్టేబుల్  మృతి

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. నేరస్థుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపారు క్రిమినల్స్ . అసలేం జరిగిందంటే. మే 25 ఆదివారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని  నహల్ గ్రామంలో ఒక వాంటెడ్ క్రిమినల్‌ ఖాదిర్ ను పట్టుకోవడానికి  నోయిడా పోలీస్ స్టేషన్ ఫేజ్-3కి చెందిన  పోలీసు బృందం అక్కడికి వెళ్లింది.

ALSO READ | బెంగుళూర్‎లో రేవ్ పార్టీ భగ్నం.. 31 మంది అరెస్ట్.. సగం మంది ఐటీ ఉద్యోగులే..!

 పోలీసు బృందం ఖాదిర్ నివాసానికి  వెళ్లి దాడి ప్రారంభించగానే అక్కడే ఉన్న గ్యాంగ్  పోలీసు బృందంపై రాళ్లు రువ్వారు. తరువాత విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల్లో కానిస్టేబుల్ సౌరభ్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు .అతడిని వెంటనే సమీపంలోని  ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే కానిస్టేబుల్ చనిపోయినట్లు  వైద్యులు చెప్పారు. నోయిడా పోలీస్ కమిషనరేట్ సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని జరిగిన పరిణామాల గురించి ఆరా తీశారు.

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఖాదీర్ పై   ఇప్పటికే 24 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని చెప్పారు పోలీసులు.  పోలీసులపై జరిగిన దాడిలో అతను తప్పించుకున్నాడు. అయితే అతన్ని, అతను తప్పించుకోవడానికి సహాయం చేసిన వారిని అరెస్టు చేయడానికి పోలీసులు అనేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని  నిందితులను కఠినంగా శిక్షిస్తామని డిసిపి రూరల్ సురేంద్ర నాథ్ తివారీ తెలిపారు.