పటాన్ చెరు నియోజకవర్గంలో ఆధునిక వసతులతో మోడల్ పోలీస్ స్టేషన్లు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు నియోజకవర్గంలో ఆధునిక వసతులతో మోడల్ పోలీస్ స్టేషన్లు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
  • బొల్లారం పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన 
  • ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి

జిన్నారం, వెలుగు: పటాన్ చెరు నియోజకవర్గంలో ఆధునిక వసతులతో మోడల్ పోలీస్ స్టేషన్లు నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బొల్లారం మున్సిపల్ పరిధిలోని సర్వేనెంబర్ 248లో ఎకరా స్థలంలో హెట్రో లేబరేటరీస్ సౌజన్యంతో రూ.3  కోట్ల 50 లక్షల వ్యయంతో నిర్మించే మోడల్ పోలీస్ స్టేషన్ పనులకు ఆదివారం ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఐజీ సత్యనారాయణ గౌడ్, ఎస్పీ పరితోశ్ పంకజ్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మినీ ఇండియాగా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు కాపాడేందుకు నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్లను ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. గుమ్మడిదలలోను  హెట్రో లేబరేటరీస్  సౌజన్యంతో రూ.2 కోట్ల 50 లక్షలతో మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అమీన్​పూర్​, పటాన్ చెరు, కొల్లూరు, పోలీస్ స్టేషన్లను పునర్నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. 

ఆధునిక సాంకేతికతతో పూర్తి స్థాయి వసతులతో వీటిని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న హెట్రో లేబరేటరీస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్ రెడ్డి, డీఎస్పీ ప్రభాకర్, హెట్రో లేబరేటరీస్ డైరెక్టర్ మోహన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రవి బాబు, సీఐలు రవీందర్ రెడ్డి, వినాయక్ రెడ్డి, స్వామి గౌడ్, నరేశ్, నయీమొద్దీన్, లాలునాయక్,  మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ బాల్ రెడ్డి, చంద్రారెడ్డి, హనుమంత్ రెడ్డి, రవీందర్ రెడ్డి, అనిల్ రెడ్డి పాల్గొన్నారు.

పోచారం డంప్​ యార్డ్​ తరలింపునకు కృషి చేస్తా

రామచంద్రాపురం: తెల్లాపూర్​ మున్సిపాలిటీ పరిధిలోని పోచారం డంప్​ యార్డ్​తరలింపునకు కృషి చేస్తానని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి స్థానిక కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఆదివారం పోచారంలోని మహీధర లగ్జూరియా కాలనీలో కొత్తగా నిర్మిస్తున్న వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గేటెడ్​ కమ్యూనిటీ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రస్తుతం పోచారంలో కొనసాగుతున్న డంప్​ యార్డును వేరే ప్రాంతానికి తరలించే విషయంపై ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని వివరించారు. అనంతరం తెల్లాపూర్​లో కుల సంఘాల అభివృద్ధి కోసం కొమరం భీం కాలనీలో స్థలాలను కేటాయించారు. 

గతంలో ఇచ్చిన హామీల మేరకు మరనాత చర్చికి 80 గజాలు, నాయీ బ్రాహ్మణ సంఘానికి 150 గజాలను కేటాయిస్తూ ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. సర్పంచ్​ల ఫోరం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోమిరెడ్డి, మున్సిపల్​ మాజీ చైర్మన్ రాములు గౌడ్​, పీఏసీఎస్​ చైర్మన్​ బుచ్చిరెడ్డి, మహీధర ప్రాజెక్ట్స్​ సీఎండీ ప్రశాంత్ రెడ్డి, యాదమ్మ, ప్రభు, దేవేందర్​ యాదవ్​, లచ్చిరామ్​ నాయక్​, బాబ్జి, శ్రీశైలం, నాగరాజు, శ్రీకాంత్, జగన్​, భిక్షపతి, స్వాతి పాల్గొన్నారు.