ప్రధాని మోదీ పై బీజేపీ పార్టీ కీలక నేత ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సుబ్రమణ్యన్ స్వామి విమర్శలు గుప్పించారు. పూజలో ప్రధాని హోదా సున్నా అయినప్పుడు మోదీ పూజ చేయడానికి కుస్తి పడుతున్నారని విమర్శించారు. శ్రీరాముడిని మోదీ తన వ్యక్తిగత జీవితంలో ఆచరించలేదని ఆరోపించారు. ముఖ్యంగా తన భార్య విషయంలో అతని ప్రవర్తన రాముడి సిద్ధాంతాలకు భిన్నమని అన్నారు. గత పదేళ్లుగా ఆయన ఈ దేశంలో రామరాజ్యం ప్రాకారం అనుసరించలేదని సుబ్రమణ్యన్ స్వామి ఆరోపించారు.
Modi is muscling into the Prana Prathishta Puja, when his PM status is a zero in the Puja, nor has he followed Bhagwan Ram in his personal life especially in his behaviour to his wife, nor he has acted as per Ram Rajya as PM during the last decade.
— Subramanian Swamy (@Swamy39) January 22, 2024
ఆయన ఇప్పుడు కొత్తగా చేసిన వ్యాఖ్యలు కాదు గత నెలలోనే ప్రధాని పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మోదీ తన భార్యను విడిచిపెట్టినందుకు ప్రసిద్ధి చెందారు అని ఆరోపించారు. రాముడు అతని భార్య కోసం దాదాపు ఒకటిన్నర దశాబ్దాలు గడిపి, యుద్ధం చేసాడని అన్నారు. అయోధ్యలో రామ్ లాలా మూర్తి ప్రాణ ప్రతిష్ట పూజలో పాల్గొనడానికి రామభక్తులు మోదీని ఎలా అనుమతించగలమని ప్రశ్నించారు.
How can we Ram bhakts allow Modi to join the performing of the Pran Prathishta Puja of the Ram Lala murti in Ayodhya, when Ram spent almost one and half decades, and waged a war, to rescue his wife Sita? Modi is instead known for abandoning his wife, and yet he will do the puja?
— Subramanian Swamy (@Swamy39) December 27, 2023
మోదీ తన భార్యను విడిచిపెట్టినందుకు ప్రసిద్ది చెందాడు, ఇంకా అతను పూజ చేస్తాడా అని సుబ్రమణ్యన్ స్వామి నిలదీశాడు. దీంతో ఆయన కామెంట్స్ కాస్త వైరల్ అయ్యాయి. సొంత పార్టీ నేత ప్రధాని మోదీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం పై అంతా ఆశ్ఛర్యానికి గురవుతున్నారు.