మోడీజీ 24 క్యారెట్ల బంగారం లాంటి వ్యక్తి

మోడీజీ 24 క్యారెట్ల బంగారం లాంటి వ్యక్తి

ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఆయన రాజకీయ జీవితంత నేటి విద్యార్థులకు ఓ పాఠమని అన్నారు.ప్రధాని మోడీ రాజకీయాల్లో 20ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఢిల్లీలో 'డెలివరింగ్‌ డెమోక్రసీ' అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఆ కార్యక్రంలో పాల్గొన్న రాజ్ నాథ్.. రాజకీయ నేతగా మోడీ ఎనలేని సేవ చేస్తున్నారని అన్నారు. అంతేకాదు ..ఆయన 24 క్యారెట్ల బంగారమంత స్వచ్ఛమైన వ్యక్తి అని అన్నారు.

 20ఏళ్లుగా  రాజకీయాల్లో ఉంటూ పాలన కొనసాగిస్తున్నప్పటికీ ఇంతవరకూ మోడీ పై ఒక్క అవినీతి మరక లేదన్నారు.  గత రెండు దశాబ్దాల ఆయన రాజకీయ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారని తెలిపారు. వాటిని దాటుకుని ఈ స్థాయికి చేరుకున్నారన్నారు. ఆయన జీవితాన్ని మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు బోధించాలని.. సమర్థమైన నాయకత్వం, సమర్థ పాలనకు కేస్‌ స్టడీగా ప్రధాని జీవితాన్ని విద్యార్థులకు చెప్పొచ్చన్నారు.