పుల్వామా.. ఢిల్లీలో అమరవీరుల స్మారక స్థూపం: మోడీ

పుల్వామా.. ఢిల్లీలో అమరవీరుల స్మారక స్థూపం: మోడీ

మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆదివారం మోడీ దేశప్రజలతో మాట్లాడారు. పుల్వామా ఉగ్రదాడిని ఖండించారు. అమరవీరుల సంస్మరణార్థం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద స్మారక స్థూపం నిర్మిస్తామన్నారు ప్రధాని మోడీ. భారత జవాన్లు అన్ని వేళల్లో అసామాన ధైర్య సాహాసాలు ప్రదర్శించారన్నారు మోడీ. పుల్వామా ఘటనలో భరత మాత తన వీరపుత్రుల్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పుల్వామా ఘటనను దేశం మొత్తం వ్యతిరేకిస్తోందన్నారు మోడీ. జాతి మొత్తం అమరవీరుల కుటుంబాలకు అండగా నిలబడుతుందన్నారు. 53వ మన్ కీ బాత్ లో మాట్లాడిన మోడీ మళ్లీ మేలో మట్లాడతానని చెప్పారు.