ఎర్రకోటపై జెండాకు అవమానం జరగడం బాధాకరం

ఎర్రకోటపై జెండాకు అవమానం జరగడం బాధాకరం

ఎర్రకోటపై జరిగిన దాడిని ఖండించారు ప్రధాని నరేంద్ర మోడీ. 26న జెండాకు అవమానం జరగడం బాధ కలిగించిందన్నారు. మన్ కీ బాత్ సందర్బంగా మాట్లాడిన మోడీ.. సంక్రాంతి ,లోహ్డీ,పొంగల్,బిహు జరుపుకున్నామన్నారు. పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగించారన్నారు. పద్మ అవార్డులు కూడా వచ్చాయన్నారు. పద్మ అవార్డులు వచ్చిన వారి గురించి తెలుసుకోవాలన్నారు. వారు చేసిన సేవలను ప్రేరణ పొందాలన్నారు. ఆస్ట్రేలియాలో భారత ఆటగాళ్లు సత్తాచాటారన్నారు. కరోనాపై పోరాటంలో ఏడాది పూర్తయిందన్నారు . చూస్తుండగానే జనవరి కూడా గడిచిపోయిందన్నారు. 15రోజుల్లోనే 30లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. వ్యాక్సిన్ పై బ్రెజిల్ అధ్యక్షుడు చేసిన ట్వీట్ ను ప్రస్తావించారు మోడీ. వ్యాక్సిన్ విషయంలో భారత్ ఇపుడు ఆత్మనిర్భర్ అని అన్నారు. ఈ ఏడాదితో స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతుందన్నారు.