కరోనాపై పాటకు మోడీ ప్రశంస..స్పందించిన చిరు

కరోనాపై పాటకు మోడీ ప్రశంస..స్పందించిన చిరు

దేశ వ్యాప్తంగా కరోనాను అరికట్టేందుకు ప్రజల్లో  అవగాహన కల్పించడానికి  మ్యూజిక్ డైరెక్టర్ కోఠి ఆధ్వర్యంలో మెగస్టార్ చిరంజీవి, నాగార్జున,వరుణ్ తేజ్,సాయిథరమ్ తేజ్ లు  రూపొందించిన పాట బాగా పాపులర్ అయ్యింది. ఈ పాటను డీడీ న్యూస్ ట్వీట్ చేయడంతో ప్రధాని మోడీ వరకు చేరింది. ఈ పాటను చూసిన మోడీ.. కరోనాపై  ప్రజలకు అవగాహన కల్పించేలా పాట రూపంలో చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయిథరమ్ తేజ్  మంచి  మెసేజ్ ఇచ్చారని మోడీ  ధన్యవాదాలు తెలుపుతూ తెలుగులో ట్వీట్ చేశారు. ‘అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం.అందరం సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం‘ అని ట్వీట్ చేశారు మోదీ.

అయితే మోడీ ట్వీట్ కు రిప్లై ఇచ్చిన చిరంజీవి  మోడీకి ధన్యవాదాలు తెలిపారు. కరోనా క్రైసిస్ లో ఉన్న మన దేశాన్ని కాపాడడానికి మోడీ చేస్తున్న కృషిని కొనియాడారు.మీరు చేస్తున్న ఈ యజ్ఞంలో తమవంతు కృషి చేశామన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటీకి తమ తరపున కృతజ్ఞతలు తెలిపారు చిరంజీవి.