తొగుట (దౌల్తాబాద్) వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జీ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వివాహ వార్షికోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో దౌల్తాబాద్ కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై మంత్రికి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఐలాపురం కనకయ్య, వైస్ చైర్మన్ మద్దెల స్వామి, మండల అధ్యక్షుడు పడాల రాములు, రాయపోల్ మండల అధ్యక్షుడు తప్పేట సుధాకర్, టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి గణేష్ , యువజన నాయకులు జాల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
