రేపు రాహుల్ నియోజకవర్గానికి ప్రధాని మోడీ

రేపు రాహుల్ నియోజకవర్గానికి ప్రధాని మోడీ

రేపు (ఆదివారం) రాహుల్ గాంధీ నియోజకవర్గం అమేథిలో పర్యటించనున్నారు ప్రధాని మోడీ. ఉత్తరప్రదేశ్ లోని అమేథిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొనున్నారు. 2014 మే 5న అమేథిలో పర్యటించిన మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సారి అమేథి పర్యటనకు వెళ్లనున్నారు. దీంతో గాంధీ కుటుంబానికి నమ్మకంగా ఉన్న ఈ నియోజక వర్గంలో పర్యటన ఉత్కంఠ రేపుతోంది. సభ తర్వాత ఆర్గన్స్ ఫ్యాక్టరీ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.