మే 2 నుంచి మోడీ విదేశీ పర్యటన 

మే 2 నుంచి మోడీ విదేశీ పర్యటన 

మే 2 నుంచి మోడీ విదేశీ పర్యటన 
మూడు దేశాల్లో మోడీ సుడిగాలి పర్యటన
2022లో మోడీ తొలి ఫారిన్ టూర్ 
జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ వెళ్లనున్న ప్రధాని 

ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు. మే 2 నుంచి మూడు రోజుల పాటు ఆయన విదేశాల్లో పర్యటించనున్నారు. ముందుగా జర్మనీకి వెళ్లనున్నారు. అక్కడి నుంచి డెన్మార్క్ వెళ్తారు. తిరుగు ప్రయాణంలో మే 4వ తేదీన ప్యారిస్ చేరుకుంటారు. 

బెర్లిన్‌లో జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్స్‌తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఇండియా -జర్మనీ ఇంటర్-గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (IGC) 6వ ఎడిషన్‌‌లో ప్రధాని మోడీ, జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్స్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి మూడు దేశాల నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

అనంతరం డెన్మార్క్‌ ప్రధాని ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ కోపెన్‌హాగన్ వెళ్లనున్నారు. అక్కడ డెన్మార్క్ ప్రభుత్వం ఆతిథ్యమిస్తున్న 2వ ఇండియా-నార్డిక్ సమ్మిట్‌లో మోడీ పాల్గొననున్నారు. ఈ సదస్సులో ఐస్‌ల్యాండ్, నార్వే, స్వీడన్, ఫిన్‌లాండ్ దేశాల ప్రధానమంత్రులతో మోడీ చర్చించనున్నారు. కరోనా అనంతరం ఆర్ధిక పరిస్థితులు, వాతావరణ మార్పులు, నూతన ఆవిష్కరణలు, పునరుత్పాదక ఇంధన వనరులు, ప్రపంచ భద్రత వంటి అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. 

ప్రధాని నరేంద్ర మోడీ తిరుగు ప్రయాణంలో ప్యారిస్‌లో ఆగి.. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇటీవల తిరిగి ఎన్నికైన ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో చర్చలు జరుపుతారు. గత ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్మాన్యుయేల్ భారీ విజయాన్ని సాధించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మోక్రాన్‌ను అభినందించనున్నారు.

మరిన్ని వార్తల కోసం..

దేశానికి కావాల్సింది ఫ్రంట్లు​ కాదు..కొత్త ఎజెండా

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌‌‌‌‌‌‌‌కు కోహ్లీ దూరం!