
హైదరాబాద్ నగరంలో మొహర్రం ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చార్మినార్ పరిధిలోని డబీర్ పురా బీబీకా ఆలం వద్దం మొహర్రంకార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ పాల్గొన్నారు. మొహర్రం సందర్భంగా బీబీకా ఆలంలో మంత్రి పొన్న ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు.
మరోవైపు మోహర్రం సంతాప దినాల్లో భాగంగా 10వ మోహర్రం అయిన బుధవారం (జూలై 17, 2024) రోజు జరిగే బిబి కా అలం ఉరేగింపుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హైదరాబాద్ పాతబస్తీ డబీర్ పురలోని బీబీకా ఆలం నుంచి ఏనుగుపై బీబీకా ఆలం ఊరేగింపు మధ్యాహ్నం ప్రారంభం అయింది.
బీబీకా ఆలంలో షియా ముస్లిం సోదరులు కత్తులతో,బ్లేడులతో తమ,తమ శరీరం పై కొట్టుకుంటూ రక్తాన్ని చిందిస్తు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ ఊరేగింపు డబీర్ పురా బీబీకా ఆలం నుంచి మొదలై షేక్ ఫయాజ్ కమాన్, అలీ జ కోట్ల, చార్మినార్, గుల్జార్ హౌజ్, పంజేష, మీర్ ఆలం మండి, పురాణా హవేలీ, దరూల్ షిఫా, ఖాళీ ఖబర్, చాదర్ ఘాట్ వరకు కొనసాగుతుంది.
ALSO READ | ప్రాణత్యాగానికి ప్రతీక మొహర్రం
మొహర్రం సందర్భంగా బీబీకా ఆలం ఊరేగింపు సందర్భంగా అన్ని భద్రతా ఏర్పాటు చేశామన్నారు సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహర. దాదాపు 1000 మంది పోలీసులు బందో బస్తులో పాల్గొంటున్నారు.పాత బస్తీ మొత్తం పోలీస్ ప్రొటెక్షన్ లోనే ఉంటుంది..
ఊరేగింపు సమయంలో పబ్లిక్ కోసం మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసా మన్నారు. పాతబస్తీలో బుధవారం మధ్యాహ్నం మొదలైన ఊరేగింపు.. చాదర్ ఘాట్ వరకు కొనసాగుతుందని అన్నారు. దాదాపు 5 కిలోమీటర్లు ఈ ఊరేగింపు జరుగుతుంది. రాత్రి 7.30 గంటల సమయంలో బీబీకా ఆలం ఊరేగింపు ముగుస్తుందని సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహర అన్నారు .