కొవిడ్‌ బాధితుల కోసం మార్కెట్లోకి మోల్నుపిరవిర్ డ్రగ్

కొవిడ్‌ బాధితుల కోసం మార్కెట్లోకి  మోల్నుపిరవిర్ డ్రగ్

కరోనా సోకిన వారికి ఉపయోగించే మోల్నుపిరవిర్ డ్రగ్ ను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపింది..ఆప్టిమస్ ఫార్మా కంపెనీ. మైల్డ్ అండ్ మోడరేట్ గా కరోనా సోకిన వారికి.. మొదటి ఐదు రోజులు ఈ డ్రగ్స్ ను వాడితే.. వైరల్ సామర్ధ్యం తగ్గుతుందన్నారు కంపెనీ ప్రతినిధులు. క్లినికల్ ట్రయిల్స్ లో మంచి ఫలితాలు రావడంతో పాటు.. పది రోజుల లోపు.. RTPCR టెస్ట్ లో కరోనా నెగిటివ్ వస్తుందన్నారు. మోల్నుపిరవిర్ ను వాడితే రెమిడిసివర్ లాంటి ఖరీదైన మెడిషన్ కూడా అవసరం లేదన్నారు.