ప్రాణాలు తీసిన మూమూస్​ ఛాలెంజ్..

ప్రాణాలు తీసిన మూమూస్​ ఛాలెంజ్..

ఫ్రెండ్స్​ సరదాగా చేసుకున్న ఛాలెంజ్​లే ప్రాణాల మీదకు తీసుకువస్తాయి. అలాంటి ఘటనే బీహార్​లో జరిగింది. ఆ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్‌లో స్నేహితులు పెట్టిన మూమూస్‌ ఈటింగ్‌ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఒక యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఫ్రెండ్స్​కండిషన్​ కంటే  ఎక్కువ(150 మూమూస్​) తినడంతో ఆ యువకుడు అనారోగ్యం పాలయ్యాడని, అనంతరం ఊపిరి తీసుకోలేక ప్రాణాలు కోల్పోయాడని డాక్టర్లు  చెబుతున్నారు. 

దీంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.   పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  గోపాల్‌గంజ్‌లో కొందరు స్నేహితులు మూమూస్‌ ఈటింగ్‌ ఛాలెంజ్‌ పెట్టుకున్నారు. ఇందులో పాల్గొన్న బిపిన్‌ కుమార్‌(25) ఛాలెంజ్‌కు మించి అధికంగా మూమూస్‌ తిన్నాడు. దీంతో ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడ్డాడు.  

అతని పరిస్థితి గమనించిన  తోటి మిత్రులు ఆసుపత్రికి తరలించారు.  అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. బిపిన్​కుమార్​ఓ మొబైల్‌ రిపేరింగ్‌ షాప్​లో పనిచేస్తుంటాడు. 

విషమిచ్చి చంపారు..

తన కుమారుడిని స్నేహితులే ఉద్దేశపూర్వకంగా హత్య చేశారని మృతుడి తండ్రి ఆరోపించారు. బిపిన్​కు విషమిచ్చారని అన్నారాయన. ఘటనపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.