బియ్యం సంచిలో దాచుకున్న పైసలు.. బంగారం ఎత్తుకెళ్లిన కోతులు

బియ్యం సంచిలో దాచుకున్న పైసలు.. బంగారం ఎత్తుకెళ్లిన కోతులు

తమిళనాడులో సంఘటన

తంజావూరు: ఓ వృద్ధురాలు దాచిపెట్టుకున్న డబ్బు, బంగారు నగలను కోతుల గుంపు ఎత్తుకెళ్లింది. ఈ సంఘటన తమిళనాడు తంజావూరు జిల్లాలోని వీర మంగుడిలో జరిగింది. 70 ఏళ్ల వృద్ధురాలు జి.శర తంబల్ భర్త చనిపోవడంతో ఒంటరిగా ఒక గుడిసెలో ఉంటోంది. ఆమె ఎంతో కష్టపడి 25వేల రూపాయలను కూడబెట్టుకుంది. కష్టకాలంలో అక్కెరకు వస్తాయని ఖర్చుపెట్టకుండా దాచిపెట్టుకుంది. ఈ డబ్బులతో పాటు బంగారు నగలను బియ్యం సంచిలో పెట్టింది. మంగళవారం ఆమె బట్టలు ఉతకడానికి బయటకు వెళ్లిన టైమ్ లో ఇంట్లోకి దూరిన కోతులు అరటిపండ్లతో పాటు బియ్యం సంచిని ఎత్తుకెళ్లాయి. ఇంటికి తిరిగి వచ్చిన శరతంబుల్ బియ్యం సంచి కనిపించక పోయేసరికి కంగారు పడింది. బయటకు వచ్చి చూస్తే ఇంటి పైనున్న కోతుల గుంపు దగ్గర సంచి కనిపించింది. గ్రామస్తులకు విషయం చెప్పగా వారు కోతులను
వెంబడించినా ఫలితం లేకుండా పోయింది.

For More News..

ఫ్లైట్ దిగి..జనం పై నుంచి నడిచిండు

4 నెలల్లో 2 కోట్ల కొలువులు పోయాయ్

అన్ని జాబులకు ఒకటే టెస్ట్