వర్షం వచ్చినా.. వలస పక్షులు రాలె

వర్షం వచ్చినా.. వలస పక్షులు రాలె

బెర్హంపూర్​: నైరుతి రుతుపవనాలు చురుగ్గా పనిచేస్తున్నాయ్​.. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయ్​.. అందరికీ హ్యాపీ. కానీ, ఒక ప్రాంతం మాత్రం బోసిపోయి చూస్తోంది. ఎందుకో తెలుసా.. నైరుతికి ముందే వచ్చే వలస పక్షులు రాలేదని. ఒడిశాలోని చిలకా సరస్సుకు వివిధ దేశాల పక్షులు రుతుపవనాలు వచ్చే కన్నా ముందే వస్తుంటాయి. కానీ, ఈ సారి మాత్రం రాలేదు. జాకోబిన్​ కుక్కూ (స్థానికంగా పీకా అనిపిలుస్తారు) మాన్​సూన్​కు ముందే వస్తుందని, కానీ, దాని జాడ ఇప్పటిదాకా లేదని, ఇతర పక్షులదీ అదే పరిస్థితి అని ప్రముఖ ఆర్నిథాలజిస్ట్​ (పక్షి సైంటిస్టు) ఉదయ్​ నారాయణ్​ దేవ్​ చెప్పారు. ఆఫ్రికా నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి కరెక్ట్​గా నైరుతి టైంకు ఆ పక్షి చిలకాలో వాలిపోతుందని, కారణమేంటో తెలియదు గానీ ఆ పక్షి ఇప్పుడు రాలేదని ఆయన చెప్పారు. అది వచ్చిందంటే మాన్​సూన్​ వచ్చిందన్న నమ్మకం జనాల్లో ఉంటుందన్నారు. అదే కాకుండా ఇంకా కొన్ని రకాల పక్షులూ చిలకాకు రాలేదని, కారణాలేంటో ఇప్పటిదాకా తెలియదని అన్నారు.