24 గంటల్లో 4 వేలకు పైగా మరణాలు

24  గంటల్లో 4 వేలకు పైగా మరణాలు

దేశంలో కరోనా తీవ్రత తగ్గుతోంది. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3 లక్షల 11 వేల 170 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2 కోట్ల 46 లక్షల 84 వేల 77 కు పెరిగింది. ఇక నిన్న కరోనా కారణంగా 4 వేల 77 మంది చనిపోయారు. ఇప్పటివరకూ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 2 లక్షల 70 వేలు దాటింది. నిన్న ఒక్క రోజే దేశంలో 3 లక్షల 62 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ 2 కోట్ల 7 లక్షల 95 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 36 లక్షల 18 వేలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 31 కోట్ల 48 లక్షల 50 వేల 143 శాంపిల్స్ టెస్టు చేసినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. నిన్న ఒక్కరోజే 18 లక్షల 32 వేల 950 మందికి పరీక్షలు చేసినట్లు స్పష్టం చేసింది. ఇక ఇప్పటివరకూ 18 కోట్ల 22 లక్షల 20 వేల 164 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది.