గజ్వేల్లో వందమందికి పైగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రాజీనామా

గజ్వేల్లో  వందమందికి పైగా  టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రాజీనామా

సిద్దిపేట జిల్లా : సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ లో టీఆర్ఎస్ కు షాక్ తగిలింది.   కొండపాక మండలం జప్తినాచారంకు చెందిన వందమందికి పైగా టీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేశారు. కొండపాక మండలంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయంటూ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి.. టీఆర్ఎస్ నాయకుల దిష్టి బొమ్మలను తగలబెట్టారు.

గతంలో అధికారులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించిన వారికి కాకుండా...స్థానిక నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి అనర్హులకు కేటాయించారని ఆరోపించారు. అర్హులైన వారికే ఇండ్లు ఇవ్వాలని గ్రామస్తులందరూ డిమాండ్ చేశారు. త్వరలోనే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కార్యకర్తలు వెల్లడించారు.