ఫ్రెషర్లను నియమించుకోవడంపై కంపెనీల ఆసక్తి

 ఫ్రెషర్లను నియమించుకోవడంపై కంపెనీల ఆసక్తి
  • ఐటీ, ఈ–కామర్స్‌‌‌‌‌‌‌‌, టెలికమ్యూనికేషన్‌‌‌‌‌‌‌‌, టెక్ స్టార్టప్‌‌‌‌‌‌‌‌లలోనే ఎక్కువ
  • బెంగళూరు, ముంబై, ఢిల్లీ సిటీలలో ఫ్రెషర్లకు ఫుల్ గిరాకీ

బిజినెస్‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఈ ఏడాది చివరి ఆరు నెలల్లో ఫ్రెషర్లను నియమించుకోవడాన్ని కంపెనీలు పెంచుతాయని టీమ్‌‌‌‌‌‌‌‌లీజ్‌‌‌‌‌‌‌‌ ఎడ్‌‌‌‌‌‌‌‌టెక్ రిపోర్ట్ ఒకటి వెల్లడించింది. మొత్తం 59 శాతం ఎంప్లాయర్లు (జాబ్స్ ఇచ్చేవారు) ఫ్రెషర్లను నియమించుకోవడంపై ఆసక్తిగా ఉన్నారని తెలిపింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలలతో పోలిస్తే ఇది 12 శాతం ఎక్కువ. ఎంప్లాయర్లు ఎంట్రీ లెవెల్‌‌‌‌‌‌‌‌ జాబ్స్‌‌‌‌‌‌‌‌కు మొగ్గుచూపుతున్నారని, ఫ్రెషర్ల నియామకం గణనీయంగా పెరుగుతుందని టీమ్‌‌‌‌‌‌‌‌లీజ్‌‌‌‌‌‌‌‌ ఎడ్‌‌‌‌‌‌‌‌టెక్‌‌‌‌‌‌‌‌ ఫౌండర్ శాంతను రూజ్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు.

దేశంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు దొరకడంలో మార్పులొచ్చాయని అన్నారు. 59 శాతం కంటే ఎక్కువ మంది ఎంప్లాయర్లు ఈ ఏడాది జులై– డిసెంబర్ మధ్య ఫ్రెషర్లను నియమించుకోవడంపై ఆసక్తి చూపించారని, వీరిని హైర్ చేసుకోవడం ఈ ఏడాది 42 శాతం పెరిగిందని అన్నారు. ఫ్రెషర్లను హైర్ చేసుకోవడం ఇంకా పెరుగుతుందని  అంచనావేశారు. 14 లొకేషన్లలోని  మొత్తం 18 ఇండస్ట్రీలకు చెందిన 865 కంపెనీల నుంచి డేటాను సేకరించి ఫ్రెషర్ల నియామకంపై  ప్రస్తుత మార్కెట్ సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌ను ‘కెరీర్ అవుట్‌‌‌‌‌‌‌‌లుక్‌‌‌‌‌‌‌‌’ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో టీమ్‌‌‌‌‌‌‌‌లీజ్‌‌‌‌‌‌‌‌ ఎడ్‌‌‌‌‌‌‌‌టెక్‌‌‌‌‌‌‌‌ వెల్లడించింది. 
ఈ సెక్టార్లలోనే ఎక్కువ..
ఈ రిపోర్ట్ ప్రకారం, ఐటీ, ఈ–కామర్స్‌‌‌‌‌‌‌‌, టెక్నాలజీ స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు, టెలికమ్యూనికేషన్స్ సెక్టార్లలో ఫ్రెషర్లకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐటీ, ఈ–కామర్స్‌‌‌‌‌‌‌‌  సెక్టార్లలోని  65 % కంపెనీలు ఫ్రెషర్లను నియమించుకోవడంపై మొగ్గుచూపాయని,  టెక్నాలజీ స్టార్టప్‌‌‌‌‌‌‌‌లలో 48 % కంపెనీలు, టెలికమ్యూనికేషన్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 47% కంపెనీలు  ఫ్రెషర్లను నియమించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని ఈ రిపోర్ట్ వెల్లడించింది. కెరీర్ అవుట్‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌ ప్రకారం, ఐటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ పెరుగుతోంది.

ఈ డిమాండ్‌‌‌‌‌‌‌‌ను చేరుకోవడానికి సుమారు లక్ష మంది ఫ్రెషర్లను ఐటీ కంపెనీలు నియమించుకుంటాయి.  టెలికం కంపెనీలు కూడా దేశం మొత్తం మీద తమ డేటా సెంటర్లను విస్తరిస్తున్నాయని ఈ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌  తెలిపింది. దీంతో ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా ఉద్యోగ నియామకాలు ఊపందుకుంటాయని వివరించింది.  సిటీల పరంగా చూస్తే ఫ్రెషర్లను హైర్ చేసుకోవడంలో బెంగళూరు ముందుంది. ఈ సిటీలోని 68 % ఎంప్లాయర్లు ఫ్రెషర్ల నియామకానికి మొగ్గు చూపారు. ముంబై (50 %), ఢిల్లీ (45 %) సిటీలలో కూడా ఫ్రెషర్ల హైరింగ్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా జరగనుంది.

హోటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెస్టారెంట్లలో పెరిగిన హైరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

కస్టమర్లతో డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇంటరాక్ట్ అయ్యే రోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు డిమాండ్ పెరుగుతోంది. ఫెస్టివ్ సీజన్ స్టార్ట్‌‌ కానుండడంతో  రెస్టారెంట్లు, హోటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో హైరింగ్ యాక్టివిటీ ఊపందుకుంది. ‘ ఫెస్టివ్ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు  కస్టమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, కిచెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో పనిచేసేవారి కొరత ఏర్పడింది. ఈ ఏడాది మార్చి తర్వాత నుంచి హాస్పిటాలిటీ సెక్టార్ వేగంగా రికవరీ అయ్యింది. కొన్ని అంశాల్లో కరోనా ముందు స్థాయికి కూడా చేరుకుంది.

త్వరలో ఫెస్టివ్ సీజన్ కూడా ఉండడంతో మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వినియోగం..రెండూ పెరుగుతాయి’ అని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ఇండియా (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏఐ)  ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కబిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూరి అన్నారు. ఈ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐదు లక్షల రెస్టారెంట్లు మెంబర్లుగా ఉన్నాయి. పని తెలిసిన వారు దొరకడం లేదని,  కరోనా టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోల్పోయిన చాలా మంది ఊరికి వెళ్లిపోవడమో లేదా ప్రొఫెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్చేయడమో చేశారని సూరి అన్నారు.

చాలా రెస్టారెంట్లు కొత్తగా నియమించుకున్నవారికి ట్రెయినింగ్ ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఇందుకోసం హోటల్స్ చాలా టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేటాయించాల్సి వస్తోందని వివరించారు.  రిటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  కూడా ట్యాలెంట్ ఉన్నవారు దొరకడం లేదని,  ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూడా  నియామకాలు ఊపందుకున్నాయని అన్నారు.