కేసీఆర్ పథకాలు చాలా రాష్ట్రాలు కాపీ కొడుతున్నయ్

కేసీఆర్ పథకాలు చాలా రాష్ట్రాలు కాపీ కొడుతున్నయ్
  • కేసీఆర్ పథకాలు చాలా రాష్ట్రాలు కాపీ కొడుతున్నయ్
  • మోడీ సొంత రాష్ట్రంలో ఉచిత కరెంట్ పథకం లేదు


యాదాద్రి భువనగిరి జిల్లా : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. శుక్రవారం ఆయన భువనగిరి మండలం, ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో నిర్వహించిన రైతుబంధు వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి .. కేంద్రంతో పాటు చాలా రాష్ట్రాలు తెలంగాణను కాపీ కొడుతున్నాయన్నారు. ప్రస్తుతం 1 కోటి 45 లక్షల ఎకరాలకు రైతుబంధు అమలు చేస్తున్నామని తెలిపారు. రూ. 50 వెల కోట్లు డైరెక్ట్ గా రైతుల అకౌంట్లలో జమ చేసిన గొప్ప పథకం, రైతు బంధు పథకమన్నారు. తెలంగాణలో 30 లక్షల మోటర్లకు రైతులకు  ఉచిత కరంట్ ను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్న ఆయన.. ఇందు కోసం సంవత్సరనికి 10 వెల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామన్నారు. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా  ఉచిత కరంట్ పథకం లేదని.. ధాన్యం రాశులలో, పంట దిగుబడుల్లో, సీఎం కేసీఆర్ కనిపిస్తున్నాడన్నారు. వాణిజ్య పంటలు పండించి  మరిన్ని  లాభాలు గడించాలని కోరుతున్నా అని తెలిపారు. పత్తికి మంచి డిమాండ్ ఉందని.. రైతులు ఆలోచన చేయాలన్నారు. ఈ  సీజన్ లో  కింట పత్తికి 10 వేలకు మించి ధర వస్తుందని చెప్పారు మంత్రి నిరంజన్ రెడ్డి.