కొడుకుపై బ్లేడ్‌తో దాడిచేసిన తల్లి

కొడుకుపై బ్లేడ్‌తో దాడిచేసిన తల్లి

నవమాసాలు మోసీ, కనిపెంచిన కన్నతల్లే.. తన కొడుకుపై దాడిచేసింది. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీరులో సోమవారం రాత్రి జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఆ తల్లి.. కొడుకుపై పైశాచికంగా దాడిచేసింది. బ్లేడుతో కన్న కొడుకు తొడలపై విచక్షణారహితంగా కోసింది. దాంతో బాలుడు అరుపులు పెట్టడంతో.. చుట్టుపక్కల వాళ్లు వచ్చి తల్లిని అడ్డుకొని బాలుడిని కాపాడారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో.. బాలుడిని ఆస్పత్రికి తరలించి.. తల్లిని అదుపులోకి తీసుకున్నారు.

For More News..

స్టూడెంట్‌పై అత్యాచారం చేసిన ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష

ఒకదానికొకటి ఢీకొన్న పలు వాహనాలు.. అయిదుగురు మృతి

కంప్యూటర్ వర్క్ చేసే వాళ్లు ఇలా చేస్తే చేతి వేళ్లకు బెటర్