భర్తతో గొడవ: ఇద్దరు చిన్నారులతో తల్లి ఆత్మహత్య

భర్తతో గొడవ: ఇద్దరు చిన్నారులతో తల్లి ఆత్మహత్య

మెదక్ జిల్లా: భర్తతో గొడవపడ్డ భార్యతో పిల్లలతో ఆత్మహత్య చేసుకున్న దారుణ సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. టేక్మాల్ మండలం దాదాయీపల్లి గ్రామానికి చెందిన రజిత అనే మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి గ్రామ శివారులోని గచ్చుకుంటలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం రాత్రి భర్త రాజుతో  గొడవపడిన రజిత ఈ అఘాయిత్యానికి పాల్పడింది. విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు వారి కోసం గాలించగా ..  ఇద్దరు పిల్లలు రిశ్వంత్ (4) రక్షిత (2) మృతదేహాలు లభ్యమయ్యాయి. తల్లి రజిత(25) మృతదేహం కోసం గ్రామస్తులు గాలిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన స్థానికంగా కలకల రేపింది.