మోటరోలా  మోటో జీ73 స్మార్ట్​ఫోన్​ ఇండియా మార్కెట్లో విడుదల

మోటరోలా  మోటో జీ73 స్మార్ట్​ఫోన్​ ఇండియా మార్కెట్లో విడుదల

మోటరోలా  మోటో జీ73 స్మార్ట్​ఫోన్​ను ఇండియా మార్కెట్లో విడుదల చేసింది. ఇది  8జీబీ+128జీబీ కాన్ఫిగరేషన్‌తో వస్తుంది.  ధర రూ.19 వేలు. ఈ నెల 16 నుంచి అమ్మకాలు మొదలవుతాయి.   ఇందులో మీడియా టెక్​ డైమెన్సిటీ 930 ప్రాసెసర్​, 6.5 ఇంచుల డిస్​ప్లే, ఆండ్రాయిడ్ 13 ఓఎస్​, వెనుకవైపు డ్యూయల్​ కెమెరా, సెల్ఫీలు,  వీడియో కాల్‌ల కోసం 16ఎంపీ కెమెరా, 30 వాట్ల ఫాస్ట్​ చార్జింగ్​తో కూడిన 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటాయి.  సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మోస్, ఐపీ52 వాటర్  డస్ట్ రెసిస్టెన్స్, 5జీ కనెక్టివిటీ, ఎన్​ఎఫ్​సీ వంటివి ఇతర ఆకర్షణలు.

ఫ్లిప్​ఫోన్​ను లాంచ్​ చేసిన ఒప్పో

గ్లోబల్​ స్మార్ట్​ఫోన్​ మేకర్​ ఒప్పో ఇండియా మార్కెట్లో తన ఫ్లాగ్‌షిప్ ఫోన్​ ‘ఫైండ్ ఎన్2 ఫ్లిప్’​ను లాంచ్​ చేసింది. దీని ధర రూ.90 వేలు.   ఈనెల 17 నుంచి అమ్మకాలు మొదలవుతాయి.  క్యాష్‌బ్యాక్, ఆఫర్ల ద్వారా రూ.80 వేలకే సొంతం చేసుకోవచ్చు.  ఇందులో 6.8- అంగుళాల డిస్‌ప్లే, 3.26 ఇంచుల కవర్​ స్క్రీన్​,  50 ఎంపీ డ్యూయల్​ కెమెరా,  మీడియాటెక్ డైమెన్సిటీ 9000+ ప్రాసెసర్,-  44 వాట్ల సూపర్‌వూక్ ఫ్లాష్ చార్జింగ్‌, 4,300ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.

స్టూడెంట్ల కోసం హెచ్​పీ క్రోమ్​బుక్​

పర్సనల్​ కంప్యూటర్స్​,  ప్రింటర్ కంపెనీ హెచ్​పీ స్టూడెంట్ల కోసం - "క్రోమ్​బుక్​ 15.6"ని  ఇండియా మార్కెట్లో లాంచ్​ చేసింది. ధరలు  రూ. 28,999 నుంచి మొదలవుతాయి. ఇందులో ఇంటెల్  సెలెరాన్ ఎన్​4500 ప్రాసెసర్, 15.6 ఇంచుల స్క్రీన్​, 11.5 గంటలపాటు బ్యాటరీ లైఫ్​, గూగుల్​ క్లాస్​ రూమ్​, వై-ఫై 6, డ్యూయల్​ స్పీకర్స్​ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.