మల్కాజిగిరి, వెలుగు: స్కూల్ స్టూడెంట్ కిడ్నాప్ఘటన మల్కాజిగిరి పీఎస్పరిధిలో జరిగింది. మౌలాలిలోని సప్తగిరి కాలనీకి చెందిన బిల్డర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ కొడుకు హర్షవర్థన్(13) ఓ ప్రైవేటు స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. గురువారం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన హర్షవర్థన్ సాయంత్రం 6.30 గంటలకు ఆడుకుంటానని చెప్పి దగ్గరలోని రైల్వే గ్రౌండ్కు వెళ్లాడు. రాత్రయినా హర్షవర్థన్ తిరిగి రాకపోవడంతో తండ్రి చుట్టుపక్కల వెతికాడు. ఎక్కడా ఆచూకీ దొరక్కపోవడంతో మల్కాజిగిరి పీఎస్లో కంప్లయింట్చేశాడు.
కిడ్నాప్గా భావించిన పోలీసులు.. కేసు ఫైల్ చేసి ఆరు టీమ్స్గా ఏర్పడి బాలుడి కోసం గాలిస్తున్నారు. హర్షవర్థన్ ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.అయితే, బాలుడి తండ్రి శ్రీనివాస్కు కిడ్నాపర్ల నుంచి బెదిరింపు కాల్స్వచ్చినట్లు సమాచారం.