మౌలాలిలో రియల్టర్ కొడుకు కిడ్నాప్

మౌలాలిలో రియల్టర్ కొడుకు కిడ్నాప్

మల్కాజిగిరి, వెలుగు: స్కూల్ స్టూడెంట్ కిడ్నాప్​ఘటన మల్కాజిగిరి పీఎస్​పరిధిలో జరిగింది. మౌలాలిలోని సప్తగిరి కాలనీకి చెందిన బిల్డర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ కొడుకు హర్షవర్థన్(13) ఓ ప్రైవేటు స్కూల్​లో 8వ తరగతి చదువుతున్నాడు. గురువారం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన హర్షవర్థన్ సాయంత్రం 6.30 గంటలకు ఆడుకుంటానని చెప్పి దగ్గరలోని రైల్వే గ్రౌండ్​కు వెళ్లాడు. రాత్రయినా హర్షవర్థన్ తిరిగి రాకపోవడంతో తండ్రి చుట్టుపక్కల వెతికాడు. ఎక్కడా ఆచూకీ దొరక్కపోవడంతో మల్కాజిగిరి పీఎస్​లో కంప్లయింట్​చేశాడు.

కిడ్నాప్​గా భావించిన పోలీసులు.. కేసు ఫైల్ చేసి ఆరు టీమ్స్​గా ఏర్పడి బాలుడి కోసం గాలిస్తున్నారు. హర్షవర్థన్ ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.అయితే, బాలుడి తండ్రి శ్రీనివాస్​కు కిడ్నాపర్ల నుంచి బెదిరింపు కాల్స్​వచ్చినట్లు సమాచారం.