- నియోజకవర్గానికి నిధుల హామీతో 32 కిలోల బరువు తగ్గిన ఎంపీ
- 2300 కోట్ల నిధులు మంజూరు చేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
- బరువు తగ్గితే కిలోకు వెయ్యి కోట్లిస్తానని గతంలో హామీ
న్యూఢిల్లీ: బరువు తగ్గితే నియోజకవర్గానికి నిధులు ఇస్తానని కేంద్ర మంత్రి హామీ ఇవ్వడంతో మధ్యప్రదేశ్ ఉజ్జయిని ఎంపీ అనిల్ ఫిరోజియా ఏడు నెలల్లో ఏకంగా 32 కిలోలు తగ్గారు. 127 కిలోలున్న అనిల్ ఫిరోజియా ప్రస్తుతం 95 కిలోలకు తగ్గారు. గత ఫిబ్రవరిలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఫిట్ ఇండియా కార్యక్రమం సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘భారీ కాయుడైన అనిల్ బరువు తగ్గితే ఒక్కో కిలోకు వెయ్యి కోట్ల చొప్పున నిధులు ఇస్తాను”అని హామీ ఇచ్చారు. ఈ సవాల్ను స్వీకరించిన ఎంపీ.. ఏడు నెలల్లో రకరకాల వ్యాయామాలు చేసి 32 కిలోలు తగ్గారు. దీంతో కేంద్ర మంత్రిని కలిసి నిధులివ్వాలని కోరానని, ఆయన 2300 కోట్ల అభివృద్ధి పనులను ఆమోదించారని ఎంపీ అనిల్ ఫిరోజియా మీడియాకు తెలిపారు.