కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే దాడి: ఎంపీ అర్వింద్

కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే దాడి: ఎంపీ అర్వింద్

టీఆర్ఎస్ కార్యకర్తల దాడిపై ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాల మేరకే హైదరాబాద్ లోని తన నివాసంపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని ఆరోపించారు. ఇంట్లో వస్తువులు పగలగొడుతూ బీభత్సం సృష్టించారని వాపోయారు. ఇంట్లో ఉన్న తన తల్లిని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేస్తూ పీఎంఓ, ప్రధాని నరేంద్రమోడీలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.

ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ తో టచ్లో ఉన్నారంటూ ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఎంపీ నివాసం వద్ద విధ్వంసం సృష్టించారు. ఆయన దిష్టి బొమ్మ దహనం చేయడంతో పాటు ఇంట్లోకి దూసుకెళ్లి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. టీఆర్ఎస్ ఇంట్లో ఉన్న వారిని భయభ్రాంతులకు గురిచేశారు.