మెట్ పల్లి: హిందూ సమాజంలో టీఆర్ఎస్ నాయకులు చెడపుట్టుక పుట్టారని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. టీఆర్ఎస్ లో ఉన్నోళ్లంతా హిందూ వ్యతిరేక చెంచాలకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. అయోధ్య రామ మందిర విరాళాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గురించి మాట్లాడుతూ.. శ్రీరాముడు ఎక్కడ పుట్టారో తెలియని డూప్లికేట్ కల్వకుంట్ల ఎమ్మెల్యే అయోధ్య రామాలయం నిర్మాణంపై మాట్లాడుతాడా అని మండిపడ్డారు అర్వింద్. ఒరిజినల్ కల్వకుంట్ల రామాలయానికి విరాళాలు ఇవ్వొద్దని చెప్పినా.. వినే స్థితిలో హిందువులు లేరని, నువ్వొక డూప్లికేట్ కల్వకుంట్లవి.. నీ మాటలు.. నీ ఫ్యామిలీ మెంబర్లే వినరని అన్నారు.
ఆర్టికల్ 370 బిల్లుపై పార్లమెంట్ లో టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటు వేసిందని.. రామలయ నిర్మాణంపై ఓటింగ్ చేస్తే టీఆర్ఎస్ రామాలయం నిర్మాణానికి వ్యతిరేకంగా ఓటు వేసేవారని ఆయన అన్నారు. ఈ రాష్ట్ర సీఎం ఫామ్ హౌజ్లో 24 గంటలు మత్తులో ఉంటే..పీఎం నరేంద్రమోదీ రోజుకు 20 గంటలపాటు ప్రజలకు సేవ చేస్తున్నారన్నారు. హిందువులు తమ సంస్కృతి, సంస్కారాలను కాపాడుకోవాలని, గులాబీ పార్టీ ప్రస్తుతం గ్రీన్ పార్టీ అయ్యిందని అన్నారు.
కొత్త సీఎం వస్తున్నాడని మంత్రి పదవి పొందేందుకు డూప్లికేట్ కల్వకుంట్ల రామాలయంపై వ్యాఖ్యలు చేశారన్నారు. కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ను ఈ రోజు నుంచి కల్వకుంట్ల ఖాన్ సాబ్ క నామకరణం చేసినట్లు బీజేపీ నాయకులు తీర్మానం చేశారు