ఏపీలో అధికార పార్టీ వైసీపీ మరోషాక్ తగిలింది. ఆ పార్టీకి ఎంపీ బాలశౌరీ రాజీనామా చేశారు. జనవరి 13వ తేదీ శనివారం వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ప్రస్తుతం ఆయన మచిలీపట్నం ఎంపీగా ఉన్నారు. ఇటీవల వైసీపీకి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కొద్దిరోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండడంతో అసంతృప్తి నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు.