బియ్యం టెండర్లలో గంగుల రూ. 13 వందల కోట్లు గోల్ మాల్: బండి సంజయ్

బియ్యం టెండర్లలో గంగుల రూ. 13 వందల కోట్లు గోల్ మాల్: బండి సంజయ్

బియ్యం టెండర్లలో గంగుల కమలాకర్ రూ. 13 వందల కోట్లు గోల్ మాల్ చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. భూకబ్జాలు, కమీషన్ల దందాతో వేల కోట్లు దండుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం కొట్లాడే తనపై అవినీతి ఆరోపణలు చేయడం సిగ్గు చేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూకబ్జాలు తప్పా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు జనం బాధలేం తెలుసని నిలదీశారు. 

2023 డిసెంబర్ 3న కేసీఆర్ పవర్ కట్ కాబోతోందని యదేవా చేశారు. డిసెంబర్ 4వ తేదీ నుంచి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రేనని తేల్చి చేప్పారు బండి సంజయ్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.