రోడ్డుపక్కన హోటల్లో టీ తాగిన ఎంపీ

రోడ్డుపక్కన హోటల్లో టీ తాగిన ఎంపీ
  • కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. నిరాడంబరంగా ప్రచారానికి

నాగార్జునసాగర్: ఆయన ఒక ఎంపీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు.. కానీ రోడ్డు పక్కన ఉన్న ఓ చిన్న టీ కొట్టుకు చాలా సింపుల్ గా కామన్ మ్యాన్ లా వచ్చాడు., స్టూల్ పై కూర్చుని టీ ఆర్డిరిచ్చాడు.. తాగి వెళ్లాడు.. ఎటువంటి హంగూ లేదు.. ఆర్భాటం అసలే లేదు.. వాహనాల కాన్వాయ్ కూడా కనిపించనే లేదు.. దటీజ్ బండి సంజయ్ కుమార్.. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్తూ దారిలోని ఓ టీ కొట్టుకు ఒక సామాన్యుడిలా వచ్చిన బండి సంజయ్ కుమార్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. సింప్లిసిటీ ఈజ్ ది బెస్ట్ పాలసీ అని పరోక్షంగా చాటి చెప్పారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా, నాయకులు సంగప్ప తదితరులు కూడా బండి సజయ్ వెంట నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చారు.