సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని బీజేపీ నేతలు విమర్శించారు. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ మాట తప్పారని ఫైరయ్యారు. హైదరాబాద్ బషీర్ బాగ్లో బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జగ్జీవన్ విగ్రహానికి పూల మాలలు వేసి బీజేపీ నేతలు నివాళులర్పించారు. అనంతరం బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. బాబు జగ్జీవన్ రాం, అంబేద్కర్ జయంతుల సందర్భంగా వారిని కేసీఆర్ ఎందుకు స్మరించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడి ఎదిగిన మనిషి.. బాబు జగజ్జీవన్ రాం అని బండి సంజయ్ అన్నారు. అంబేద్కర్పై గౌరవం ఉంటే హైదరాబాద్లో ఏర్పాటు చేస్తానన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులను ఈ నెల 14వ తారీఖైనా ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని సీఎం కేసీఆర్ దళితులను మోసం చేశారని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. జగ్జీవన్ రాం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. దేశంలో దళిత సమాజానికి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ దళిత సమాజాన్ని మోసం చేశాడు
- హైదరాబాద్
- April 5, 2021
లేటెస్ట్
- చెలరేగిన కేఎల్ రాహుల్, డికాక్..CSK పై LSG విక్టరీ
- రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
- లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్
- CSK vs LSG : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..
Most Read News
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి