రాష్ట్రంలో స్కూళ్ల  సంఖ్య తగ్గి.. బార్ల సంఖ్య పెరిగింది

రాష్ట్రంలో స్కూళ్ల  సంఖ్య తగ్గి.. బార్ల సంఖ్య పెరిగింది

కరీంనగర్: రాష్ట్రంలో స్కూళ్ల  సంఖ్య తగ్గి.. బార్ల సంఖ్య పెరిగిపోయిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. టీచర్లకు ఇచ్చిన హామీలను సర్కారు మరిచిపోయిందని ఆయన అన్నారు. టీచర్ల పీఆర్సీ కోసం తాము పోరాడుతున్నామని ఆయన చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా.. మాందాన్ పల్లి శిబిరంలో మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫొటోకి పూలమాల వేసి సంజయ్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ  కూడా పాల్గొన్నారు. టీచర్స్ డే సందర్భంగా టీచర్లను ఘనంగా సన్మానించారు.