మినీ అంగన్ వాడిల జీతం రూ.6వేలు మాత్రమే

మినీ అంగన్ వాడిల జీతం రూ.6వేలు మాత్రమే

మినీ అంగన్ వాడిల సమస్యలను కేంద్రమంత్రి సృతి ఇరాని దృషికి తీసుకెళ్లారు టీఆర్ఎస్ నాయకులు, ఎంపీ బీబీ పాటిల్. శుక్రవారం కేంద్ర మంత్రిని కలిసిన పాటిల్… మినీ అంగన్ వాడిల జీతాలను.. అంగన్ వాడిలతో సమానంగా పెంచాలని కోరారు. ప్రస్తుతం మినీ అంగన్ వాడిలు కేవలం రూ.6వేల రూపాయల జీతాన్ని మాత్రమే పొందుతున్నట్లు చెప్పారు. దీంతో వారు కుటుంబాలను పోషించలేకున్నారని అన్నారు. అంగన్ వాడీలతో సమానమైన గౌరవ వేతనాన్ని, పీఎఫ్ ను, ఎండాకాలం సెలవులను, ఉద్యోగ భద్రతను కల్పించాలని ఆయన కోరారు.

కష్టపడి శ్రమిస్తున్నా మినీ అంగన్ వాడిలను ప్రోత్సహించేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని అన్నారు పాటిల్.  ఈ విషయం పై కేంద్ర మంత్రి సృతి ఇరాని సానుకూలంగా స్పందిచారని తెలిపారు. తమ సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ బీబీ పాటిల్ కు కృతజ్ఞతలు తెలిపారు మినీ అంగన్ వాడిలు.