
- పార్లమెంట్ సమావేశాల్లో దాన్ని అడ్డుకుంటం
పెద్దపల్లి: కమిషన్ల కోసమే బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం కేసీఆర్ను స్పూర్తిగా తీసుకొని బనకచర్ల అంటున్నారని విమర్శించారు. మంథని మండలంలోని పార్వతీ బ్యారేజ్ను ఆయన ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే తెలంగాణ రాష్ట్రానికి 100 నుంచి 150 టీఎంసీల నీటి నష్టం జరుగుతుందన్నారు.
డబ్బులు తినే ఉద్దేశంతోనే చంద్రబాబు.. కేసీఆర్ను ఆదర్శంగా తీసుకున్నారన్న ఎంపీ.. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో బనకచర్లను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సుందిళ్ల ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.