ట్రాన్స్ జెండర్లకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్

ట్రాన్స్ జెండర్లకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్

ట్రాన్స్ జెండర్లకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా రిక్రూట్‌మెంట్‌లో వారి కోసం ప్రత్యేక కేటగిరి ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పురుషులు లేదా మహిళలు అనే  రెండు కేటగిరీలు మాత్రమే ఉండేవి. తాజాగా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ కోసం ప్రత్యేక కేటగిరీని ప్రభుత్వం కల్పించింది. దీంతో ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తుల్లో స్త్రీ, పురుషులతో పాటు 'ట్రాన్స్‌జెండర్' అనే ఆప్షన్ కూడా అందుబాటులోకి రానుంది. మధ్యప్రదేశ్ ట్రాన్స్‌జెండర్ (హక్కుల పరిరక్షణ) రూల్స్ - 2021 కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గతేడాది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి చెందిన వారిని జనరల్ కేటగిరీ కింద ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించాలని నిర్ణయించింది.