కేంద్రానికి సంప్రదాయం గుర్తు చేయడానికే పోటీ: ఎంపీ సురేష్

కేంద్రానికి సంప్రదాయం గుర్తు చేయడానికే పోటీ: ఎంపీ సురేష్

కేంద్రానికి సంప్రదాయం గుర్తు చేయడానికే స్పీకర్ గా పోటీచేస్తున్నట్లు కూటమి అభ్యర్థి సరుష్ అన్నారు. ప్రతిపక్షానికి ఎంత మంది ఎంపీలున్నారనేది ముఖ్యం కాద్నారు. డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వనందుకే కూటమి నుంచి స్పీకర్ పోస్ట్ కు పోటీచేస్తున్నట్లు తెలిపారు. స్పీకర్ కు పోటీ చేసే విధంగా కేంద్రం తమను ప్రేరేపించిందని విమర్శించారు.

కాసేపట్లో (జూన్ 26న) ఉదయం 11 గంటలకు సీక్రెట్ బ్యాలెట్ తో ఓటింగ్ జరగనుంది. NDA తరపున మాజీ స్పీకర్ ఓంబిర్లా, ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ సీనియర్ ఎంపీ సురేష్ పోటీ చేస్తున్నారు. అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తమ ఎంపీలకు 3 లైన్ల విప్ జారీ చేశాయి. ఉదయం 11 గంటల నుంచి లోక్ సభలో ఉండాలని ఆదేశించాయి. 50 ఏళ్లలో స్పీకర్ పదవికి తొలిసారిగా ఎలక్షన్ జరుగుతోంది. మొదటిసారి 1952లో, చివరి సారి 1972లో స్పీకర్ ను బ్యాలెట్ తో ఎన్నుకున్నారు. 

సాధారణ మెజార్టీతోనే స్పీకర్ ను ఎన్నుకుంటారు. పోలైన ఓట్లలో సగానికి పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థి స్పీకర్ గా ఎన్నికవుతారు. స్పీకర్ గా పోటీ చేయడానికి ప్రత్యేక అర్హతలు లేవు. లోక్ సభ సభ్యుడిగా ఎన్నికైన ఎవరైనా స్పీకర్ పదవికి పోటీ చేయొచ్చు. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని బీజేపీ కొనసాగించింది. ఐతే ఈసారి బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ కన్నా 32 సీట్లు తక్కువగా వచ్చాయి. అటు ప్రతిపక్షాలు భారీగా పుంజుకున్నాయి. కొన్ని ప్రాంతీయ పార్టీల సహకారంతో NDA ప్రభుత్వం ఏర్పాటైంది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. ప్రస్తుతం NDAకు 293 మంది, ఇండియా కూటమికి 234 మంది ఎంపీలు ఉన్నారు.