- ఎంపీ కడియం కావ్య పిలుపు
హైదరాబాద్: యువ నాయకుడు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిపించాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య పిలుపునిచ్చారు. నవీన్కు మద్దతుగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డితో కలిసి ఆమె బుధవారం బోరబండ, ఎస్ఆర్టీ నగర్లో ప్రచారం నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తిరిగి స్థానికులకు వివరించారు. ప్రజా పాలనలో సంక్షేమం గడపగడపకూ చేరిందన్నారు. ఇదే అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిపించాలని ఆమె కోరారు. విద్యావంతుడు, స్థానికుడు, నిత్యం ప్రజల్లో ఉండే నవీన్ను గెలిపించుకుంటే నియోజకవర్గం మరింత డెవలప్ అవుతుందన్నారు.
