డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్

డిసెంబర్ నాటికి అందరికీ వ్యాక్సిన్

నాంపల్లి: బోయిగూడా కమాన్ లోని సీతారాం బాగ్ లో బస్తీ ప్రజలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాస్ బుక్స్ అందజేశారు.  పీఎం సురక్ష జీవన్ జ్యోతి, పీఎం సురక్ష బీమా, సుకన్య సమృద్ధి కింద పాస్ బుక్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిత్యావసరాలు బ్లాక్ చేయకుండా, ధరలు పెంచకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 

ప్రజలందరూ మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని కిషన్ రెడ్డి కోరారు. డిసెంబర్ నాటికి అందరికీ వాక్సిన్ ఇస్తామన్నారు. లాక్ డౌన్ లో ఆహారం లేక ఇబ్బంది పడుతున్న వారికి ప్రజలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలతో కలసి సహాయం చేయాలన్నారు. కరోనాతో చనిపోయిన వారికి, సహజ మరణం, ప్రమాదంలో మరణించిన వారందరికీ పీఎం బీమా యోజన అందుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం  కరోనాతో చనిపోతున్న వారికీ ఈ పీఎం ఇన్సూరెన్స్ ను వర్తింపజేస్తోందన్నారు. సుకన్య సమృద్ధి గర్ల్ చైల్డ్ కు బంగారు భవిష్యత్తును ఇస్తుందని.. దీంట్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.