![ఆరు గ్యారెంటీల వైఫల్యాలపై బస్సు యాత్రలు: ఎంపీ లక్ష్మణ్](https://static.v6velugu.com/uploads/2024/02/mp-laxman-fires-on-congress-govt-over-6-guarantees_YEwfTOSilo.jpg)
- ఆరు గ్యారెంటీల వైఫల్యాలపై బస్సు యాత్రలు
- హిందువుల మనోభావాలను కాంగ్రెస్ దెబ్బ తీస్తుంది
- త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటరు: రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల వైఫల్యాలను ఎండగట్టమే లక్ష్యంగా బస్సు యాత్రలు నిర్వహిస్తామని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. హిందువుల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ దెబ్బ తీస్తుందని ఫైర్అయ్యారు. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ కులాన్ని పదే పదే ప్రశ్నిస్తూ.. కాంగ్రెస్ బీసీలను అవమానిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు కూడా కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చిందని తెలిపారు. ‘అంబేద్కర్కు భారతరత్న ఇచ్చేందుకు కాంగ్రెస్కు మనసు రాలేదు.
ఐదుగురికి భారతరత్న ఇస్తే.. కాంగ్రెస్ ఓర్వలేక పోతుంది. అయోధ్య పర్యాటక, ఆధ్యాత్మిక రంగంగా వెలుగొందుతుంది. రాముడు, రామసేతు మిథ్య అని కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది. హిందువులను, హిందూ దేవుళ్లను విమర్శించడమే కాంగ్రెస్ లౌకిక వాదం. రాముడు మీద కాంగ్రెస్ అక్కసు వెళ్లగక్కింది. త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకుంటుంది. మోదీ ప్రభుత్వం హిందుత్వం కోసం పని చేస్తుందనీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విమర్శిస్తున్నరు. బీజేపీ పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక, బస్సు యాత్రలపై ఎన్నికల కమిటీ సమావేశాల్లో చర్చించాం’ అని లక్ష్మణ్ పేర్కొన్నారు.