- మున్సిపల్ కొత్త పాలకవర్గానికి ఎంపీ మల్లు రవి సూచన
షాద్ నగర్, వెలుగు: కొత్తగా ఎన్నికైన మున్సిపాలిటీ పాలకవర్గం పట్టణ అభివృద్ధికి చిత్తశుద్ధితో పాటుపడాలని నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి పిలుపునిచ్చారు. శుక్రవారం షాద్నగర్పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూరి బస్వరాజ్, వైస్ చైర్మన్ అందే మోహన్,కౌన్సిలర్లను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో విజయాన్ని అందించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని సూచించారు.
